వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాళ్ నగర్ లో ఓపెన్ నాలా పనులను మునిసిపల్ ఏఈ సత్యలక్ష్మి తో కలసి పరిశీలించిన వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పరిశీలించి వీలైనంత త్వరగా నాలా పనులను పూర్తి చేయాలని అక్కడ పనిచేసేవారిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, వెంకటేష్, కాలనీ వాసులు నర్సింగ్ రావు, శ్రవణ్, డివిజన్ అధ్యక్షులు ఓంప్రకాష్, సాయి సురేష్, శ్రీకాంత్, శివ తదితరాలు పాల్గొన్నారు.